బార్బీ మేనియా.. పింక్ ఔట్​ఫిట్స్​లో మోదీ, సోనియా.. ఫొటోలు వైరల్

-

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బార్బీ సినిమా గురించే చర్చ. ఆ సినిమాకు వెళ్లే వారు కూడా దాదాపు అందరూ పింక్ కలర్ కాస్ట్యూమ్​లోనే వెళ్తున్నారు. ఇక హాలీవుడ్‌లో బార్బీ సినిమా ఓ సెన్షేష‌న్ క్రియేట్ చేస్తోంది. మార్గ‌ట్ రాబీ, రియాన్ గోస్లింగ్ న‌టించిన ఆ ఫిల్మ్ బాక్సాఫీస్ వండ‌ర్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఆ సినిమాలో న‌టీన‌టులు పింక్ క‌ల‌ర్ దుస్తుల్లో కేక పుట్టించారు. ప్ర‌స్తుతం ఎక్క‌డికి వెళ్లినా ఆ పింక్ బార్బీ ఫీవ‌రే క‌నిపిస్తోంది.

ఆ ట్రెండ్‌ను ఓ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆర్టిస్టు అద్భుతంగా వాడుకున్నాడు. త‌న టాలెంట్​తో సెలబ్రీల ఫొటోలను బార్బీ కాస్ట్యూమ్​లో డిజైన్ చేశాడు. అలా ప్రధాన మంత్రి మోదీ, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ వంటి రాజకీయ నాయకుల ఫొటోలను బార్బీ కాస్ట్యూమ్స్​లో రూపొందించాడు. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అమిత్ షా, సోనియా గాంధీ, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్, కేజ్రీవాల్‌, మ‌మ‌తా బెన‌ర్జీ, నితిన్ గ‌డ్క‌రీ నేత‌ల‌కు చెందిన బార్బీ లుక్‌లో అదిరిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version