తెలంగాణలో రుణమాఫీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో రుణమాఫీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే మోసపూరిత హామీలు, అసత్యాలేనని ప్రధాని నరేంద్ర మోడీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేసిందని ఆరోపణలు చేశారు ప్రధాని మోడీ.

దిక్కుతోచని స్ధితిలో తెలంగాణ రైతాంగం రుణమాఫీ కోసం తిరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారన్నారు ప్రధాని మోడీ. మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌ పార్టీ రైతులను నిండా ముంచిందని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు ప్రధాని మోడీ.

తెలంగాణలో రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. రుణమాఫీలు చేయలేదని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా రుణమాఫీ చేయకపోవడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version