నేడు అహ్మదాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ పయనం కానున్నారు. అహ్మదాబాద్లోని క్రాష్ సైట్ను మోదీ సందర్శించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటల కు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి, గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించే అవకాశం ఉంది.

ఈ ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సభ్యులు ఉన్నారు.
ఈ ప్రమాదంలో 241 మంది మరణించినట్లు ధృవీకరించిన ఎయిర్ ఇండియా… కీలక ప్రకటన చేసింది. కాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని అంచనా వేసి.. 6 నెలల ముందే యువతి ట్వీట్ చేసింది. విమాన ప్రమాద ఘటనపై డిసెంబర్ 29, 2024లోనే ట్వీట్ చేశారు ఆస్ట్రో షర్మిష్టా. ‘2025లో ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుంది.. సేఫ్టీ, సెక్యూరిటీపరంగా ఇబ్బందులు ఉంటాయి.. అలాగే విమానం కూలిందన్న వార్తలు మనల్ని కలచివేస్తాయి’ అని ట్వీట్ చేసారు షర్మిష్టా. దింతో సోషల్ మీడియాలో ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.