ఉచిత బస్సు ప్రయాణం పై ప్రధాని నరేంద్ర మోడీ షాకింగ్ కామెంట్స్..!

-

దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ప్రస్తుతం ఈ పథకం కొనసాగుతోంది. అయితే, ఈ స్కీమ్పై ప్రధాని నరేంద్ర మోడీ షాకింగ్ కామెంట్స్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయంతో దాదాపు 50 శాతం మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతోందని అన్నారు. ఇలా చేయడం వల్ల మెట్రో నిర్వహణ కష్టతరంగా మారుతుందని చెప్పారు. భవిష్యత్తులో మెట్రో నిర్మాణం జరుగడం కూడా అసాధ్యంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా ఎవరూ ఆలోచించరు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారని అన్నారు. బస్సును ఫ్రీగా ఇచ్చి మెట్రోను ఖాళీ చేస్తే ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version