కర్ణాటక U-19 జట్టులో ద్రవిడ్‌ కుమారుడికి చోటు

-

టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవీడ్ కర్ణాటక U-19 జట్టులో చోటు దక్కించుకున్నారు. మన్కడ్ దేశవాళి టోర్నీ కోసం కర్ణాటక రాష్ట్ర అసోసియేషన్ 15 మందితో జట్టును ఎంపిక చేసింది.

Rahul Dravids Son, Samit, Earns A Spot In Karnatakas Vinoo Mankad Trophy Squad
Rahul Dravids Son, Samit, Earns A Spot In Karnatakas Vinoo Mankad Trophy Squad

ఈ జట్టు ధీరజ్ జె. గౌడ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. అక్టోబర్ 12 నుండి 20 వరకు హైదరాబాద్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ అండర్-14 కర్ణాటక జట్టు కెప్టెన్ గా రాణిస్తున్నారు.

కాగా అండర్ 19 మెన్ క్రికెట్ వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి 14 నుండి ఫిబ్రవరి 4 వరకు జరగనుంది. కాగా ఈ వరల్డ్ కప్ ను శ్రీలంక వేదికగా జరగనుంది. ఇక ఈ వరల్డ్ కప్ లో మొత్తం 16 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. మొత్తం నాలుగు గ్రూప్ లుగా మొదలు కానున్న ఈ టోర్నమెంట్ లో గ్రూప్ ఏ లో ఇండియా, బంగ్లాదేశ్ ఐర్లాండ్ మరియు అమెరికాలు ఉన్నాయి,

Read more RELATED
Recommended to you

Latest news