Asian Games 2023 : సెమిస్ లో ఫైనల్ కు చేరి భారత్.. బంగ్లా చిత్తు..!

-

ఆసియా క్రీడల మహిళల క్రికెట్ లో భారత్ కి ఓ పతకం ఖాయం అయింది. ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన సెమీఫైనల్ 1లో బంగ్లాదేశ్ ను 8 వికెట్ల తేడాతో భారత జట్టు చిత్తు చేసింది. దీంతో ఈ మెగా ఈవెంట్ ఫైనల్ లోకి భారత్ అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి కేవలం 51 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లతో బంగాదేశ్ పతనాన్ని శాసించగా.. సటిటాస్ సాధు, గైక్వాడ్, వైద్యా తలా వికెట్ తీశారు. బంగ్లా బ్యాటర్లలో నిగార్ సుల్తాన్ 12 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. అనంతరం 52 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్ (20 నాటౌట్), షెఫాలీ వర్మ (17) పరుగులతో రాణించారు. సెప్టెంబర్ 25న జరిగే ఫైనల్ లో భారత్ తలపడుతుంది.  సెమిఫైనల్ లో శ్రీలంక-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారితో భారత్ తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news