బీజేపీ గాలిని వాళ్లే తీసుకున్నారు : రాహుల్‌ గాంధీ

-

బీజేపీ గాలిని వాళ్లే తీసుకున్నారని… ప్రగతి భవన్ పేరు మారుస్తాం కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం…..’ప్రజల తెలంగాణ అనే స్వర్ణ యుగానికి నాంది పలుకుతుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రగతిభవన్ పేరును ‘ప్రజా పాలన భవన్’గా మారుస్తాం. 24*7 దీని తలుపులు తెరిచే ఉంటాయి.

rahul gandhi

సీఎం, మంత్రులంతా ఇందులో నిత్యం ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 72 గంటల్లో ప్రజల ఫిర్యాదులను పరిష్కరిస్తారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసం మాతో చేరండి’ అని X లో ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఒకరు ఢిల్లీలో, ఇంకొకరు హైదరాబాద్‌లో పని చేస్తున్నారన్నారు. ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయన్నారు. కొన్ని రోజులు హడావుడి చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ గెలుపు కోసం పని చేస్తున్నారన్నారు. లోక్ సభలో ఈ రెండు పార్టీలు కలిసిమెలిసి ఉండటం గమనించినట్లు చెప్పారు. కేంద్రంలోని అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news