ఢిల్లీలో రామాలయ శంకుస్థాపన సందడి, పెద్ద పెద్ద స్క్రీన్ లు ఏర్పాటు

-

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరు కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది. దేశం మొత్తం కూడా ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం కోసం ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే… ఇప్పుడు ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామాల‌య భూమి పూజ కార్యక్రమం కోసం దేశ రాజధాని ఢిల్లీ లో ఇప్పుడు పెద్ద స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు.

rama mandir
rama mandir

దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో భూమి పూజ ప్రత్యక్ష ప్రసారానికి గానూ… బిజెపి ఏర్పాట్లు చేసింది. బుధవారం నాడు భారీఎత్తున‌ దీపోత్సవ కార్య‌క్ర‌మం కూడా జరుగుతుంది. ఈ మేరకు బీజేపీ కార్యకర్తలు దీపాలను పంపిణీ చేస్తారు. ఆగస్టు 5న ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఎల్‌ఈడీ స్క్రీన్‌ల‌ను చేస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున లైవ్ ని ప్రసారం చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news