Ahmedabad Plane Crash: బ్లాక్ బాక్స్ పై కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటనను సీరియస్ గా తీసుకున్నామని. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు రామ్మోహన్ నాయుడు. కేంద్రం హోం కార్యదర్శి అధ్యక్షతన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు.

3 నెలల్లో దర్యాప్తు జరిపి కమిటీ నివేదిక ఇస్తుంది.. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు రామ్మోహన్ నాయుడు. బ్లాక్ బాక్స్ ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాము.అందులో ఉన్న సమాచారం కీలకంగా మారనుందన్నారు. బ్లాక్ బాక్స్ లో ఉన్న సమాచారం రానున్న రోజుల్లో కీలకం అవుతుందని చెప్పారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో కమిటీ వేశామని పేర్కొన్నారు.