నారా లోకేష్ ఫోటోకు పాలతో అభిషేకం చేస్తా – వైసీపీ నేత

-

నారా లోకేష్ ఫోటోకు పాలతో అభిషేకం చేస్తా అంటూ వైసీపీ నేత రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మంత్రి నారా లోకేష్ కు సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సక్రమంగా అమలు చేస్తే నారా లోకేష్ ఫోటోకు పాలాభిషేకం చేస్తా అంటూ సవాల్ విసిరిన రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.

Rachamallu
Former MLA Rachamallu Siva Prasad Reddy challenges Minister Nara Lokesh

అటు వరుదు కళ్యాణి Varudu Kalyani మాట్లాడారు. గతంలో జగన్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 90% హామీలు అమలు చేసి రికార్డు సృష్టిస్తే.. ఈ చంద్రబాబు ప్రభుత్వం కనీసం 9% కూడా అమలు చేయకుండా చెత్త రికార్డ్ సృష్టించాడన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా అంటే సుపరిపాలన అని అంటున్నారు.. అంటే ఏంటి అసలు? వీధి వీధికి మద్యం షాప్, సంధు సంధుకి బెల్ట్ షాప్, డ్రగ్స్ డోర్ డెలివరీ చేయడం సుపరిపాలనా? అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news