World Cup 2023 : ఇంగ్లాండ్ పై రోహిత్ శర్మ సెంచరీ !

-

World Cup 2023 : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇవాళ స్పెషల్. నేడు ఇంగ్లాండ్ తో మ్యాచ్ ద్వారా సారధిగా 100వ మ్యాచ్ ఆడనున్నారు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లో కలిపి 99 మ్యాచ్లకు నాయకత్వం వహించగా… భారత్ 73 మ్యాచుల్లో విజయం సాధించింది. 100 మ్యాచుల కెప్టెన్లలో అత్యధికంగా రికీ పాంటింగ్ 79 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా… విరాట్ 69 విజయాలతో మూడోస్థానంలో ఉన్నారు. మరి ఇవాళ హిట్ మ్యాన్ ఏ రికార్డు సృష్టిస్తారో చూడాలి.

ఇక ఇంగ్లాండ్ తో ఈరోజు జరిగే మ్యాచ్ లో గెలిస్తే భారత్ ఖాయం చేసు కున్నట్లే. ప్రస్తుతం భారత్ ఖాతా లో 10 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ తో గెలిస్తే 12 పాయింట్ల కు చేరుతుం ది. పాయింట్ల టేబుల్ లో పైనున్న నాలుగు జట్లు కాకుండా శ్రీలంక మాత్రమే గరిష్టంగా 12 పాయింట్లకు చేరుకోగలరు.రన్ రేట్ ప్రకారం లేదా శ్రీలంక తర్వాత ఆడనున్న మ్యాచుల ప్రకారం చూసిన భారత్ సెమిస్ బెర్త్ ఖాయమైనట్టే అంటున్నారు విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version