ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మకు గాయం !

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో టీమిండియా అద్భుత విజయాలతో రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో అన్ని గెలిచి రెండవ ప్లేస్ లో ఉంది. దానికి తగ్గట్టుగానే టీమిండియా బ్యాటర్లు అలాగే బౌలర్స్ బాగా రాణించడంతో టీమిండియా మంచి పొజిషన్లో కనిపిస్తోంది. ఇక ఇవాళ మరో రసవత్తర పోరుకు టీమిండియా సిద్ధమైంది.

rohith sharma injured

డిపెండింగ్ ఛాంపియన్స్ అయినా ఇంగ్లాండ్ జట్టుతో… టీమిండియా తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయి స్టేడియంలో జరగనుంది. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడడం క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఇంగ్లాండుతో మ్యాచ్ కోసం నిన్న ప్రాక్టీస్ చేస్తుండగా…. రోహిత్ మనికట్టుకు గాయమైంది. బ్యాటింగ్ చేస్తుండగా బాల్ తాకడంతో వెంటనే ఫిజియో వచ్చి టెస్టులు చేశారు. అయితే గాయం తీవ్రతపై స్పష్టత రాలేదు. ఒకవేళ రోహిత్ శర్మ నేటి మ్యాచ్ కు దూరమైతే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version