మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భర్తని కావాలనే చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే… గత కొద్ది రోజుల క్రితమే ఇండోర్ లో రాజా రఘువంశికి సోనమ్ అనే అమ్మాయితో వివాహం జరిపించారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే రాజా, సోనమ్ హనీమూన్ కు మేఘాలయకు వెళ్లారు. అక్కడ రాజా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాజా హత్య జరిగిన అనంతరం సోనమ్ అక్కడి నుండి పారిపోయింది.

విషయం తెలిసిన పోలీసులు అక్కడి చేరుకొని సోనమ్ తో సహా మరి కొంతమందిని ఉత్తరప్రదేశ్ లో పట్టుకున్నారు. తన భర్తను కావాలని సోనమ్ సుపారి ఇచ్చి మరి హత్య చేయించింది. కాగా సోనమ్ వివాహానికి ముందే మరో వ్యక్తితో ప్రేమలో ఉందని పోలీసులు నిర్ధారించారు. తాజాగా సోనమ్ ఫోన్ లో ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహా చేసిన ప్రైవేట్ చాటింగ్ తెరపైకి వచ్చింది. తన భర్త రాజా రఘువంశితో ప్రేమగా ఉండలేకపోతున్నానని సోనమ్ చాటింగ్ లో చెప్పింది.
పెళ్లికి ముందు నుంచే రాజాతో దూరంగా ఉంటున్నానని అతను అంటే పెద్దగా ఇష్టం లేదని వివాహం జరిగిన మూడు రోజులకే తన ప్రియుడికి మెసేజ్లు పంపింది. ఈ క్రమంలోనే సోనమ్, రాజ్ ఇద్దరూ కలిసి రాజా రఘువంశి మర్డర్ స్కెచ్ వేసి హత్య చేశారు. ప్రస్తుతం సోనమ్ ఆమె ప్రియుడు పోలీసుల వద్ద ఉన్నారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.