స్వాతి మాలీవాల్ కేసు దర్యాప్తు కోసం సిట్

-

ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్పై దాడి కేసును దర్యాప్తు చేసేందుకు దిల్లీ పోలీసులు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేశారు. నార్త్ దిల్లీ అదనపు డీసీపీ అంజిత చెప్యాలా నేతృత్యంలో ఈ టీమ్లో ముగ్గురు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, ఒకరు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ అధికారి ఉన్నారు. విచారణ జరిపిన తర్వాత సిట్ తన నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనుంది. మరోవైపు ఆప్ తనపై అసత్యాలను ప్రచారం చేస్తుందని మాలీవాల్ ఎక్స్ వేదికగా స్పందించారు.

దిల్లీ మంత్రులు, ఆప్ నేతలు తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ స్వాతీ మాలీవాల్ అన్నారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని చెప్పినందుకు తనపై పాత కేసులు తిరగేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ దిల్లీ మంత్రుల ప్రకారం ఇప్పటి వరకు తాను లేడీ సింగంగా ఉన్నానని, బిభవ్ కుమార్పై ఫిర్యాదు చేసే సరికి బీజేపీ ఏజెంట్గా మారానని స్వాతి మాలీవాల్ వ్యాఖ్యానించారు. నిజం మాట్లాడినందుకే మొత్తం ట్రోల్ ఆర్మీని తనపై మోహరించారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version