గొయ్యిలో పడ్డ కారు.. స్పాట్ లో ఆరుగురు దుర్మరణం

-

ఉత్తర్​ ప్రదేశ్​లోని కాన్పుర్ దెహాత్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నీరు ఉన్న గొయ్యిలో పడడం వల్ల ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న మరో ఇద్దరు చిన్నారులు గాయపడినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్​ స్టేషన్ పరిధిలో జగన్నాథ్​పుర్ గ్రామ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఓ కారు నీటి గుంటలో పడిపోయింది. వర్షం పడటం వల్ల అక్కడ నీటి గుంట ఉన్నట్లు వాహనదారుడు గమనించకపోయి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.  జేసీబీ సాయంతో కారును బయటకు తీసి గాయపడిన ఇద్దరు చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆరుగురి మృతదేహాలను శవపరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.  ఘటన జరిగిన సమయంలో జోరుగా వర్షం కురుస్తుండటం మరోవైపు కారు అదుపు తప్పడంతో గొయ్యిలో పడినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారో త్వరలోనే గుర్తిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news