BREAKING : బ్రిజ్ భూషణ్ కాన్వాయ్ పై రాళ్లదాడి..

-

BREAKING : బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజర్లు చేసిన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. అయితే బ్రిజ్ భూషణ్ కు ఊహించని షాక్ తగిలింది.

వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కాన్వాయ్ మీద రాళ్ల దాడి చోటు చేసుకుంది. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఉత్తర్ ప్రదేశ్ – రెజ్లర్ల మీద లైంగిక దాడి అరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. గొండా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, బీజేపీలోని రెండు వర్గాలు సెల్ఫీల కోసం ఎగబడి కొట్టుకొని చివరికి కాన్వాయ్ రాళ్ల మీద దాడి చేయగా తప్పించుకొని పారిపోయాడు వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news