చంద్రబాబు, వైఎస్ఆర్ కృషి వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి చౌరాస్తా అభివృద్ధిని చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఈ ప్రాంతం నుంచే వస్తోందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

పీజేఆర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అత్యాధునిక హంగులతో మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. రూ. 182.72 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..నాగార్జున N కన్వెన్షన్ కూల్చేస్తే ఆయనే వచ్చి చెరువులో ఉన్న ఇంకో రెండు ఎకరాలు నన్ను కలిసి ఇచ్చేసి.. నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందు ఉంటా అని చెప్పారన్నారు.