కేరళ, బెంగాల్‌ గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు

-

కేరళ, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. గవర్నర్ల వద్ద పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఆ పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పరిద్వాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖకు, గవర్నర్‌ కార్యదర్శులకు ఈ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

రాష్ట్రపతికి పంపించాల్సిన బిల్లులపై ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తున్న గవర్నర్ల చర్యను సవాలు చేస్తూ కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఏడాదికి పైగా ఎనిమిది బిల్లులపై గవర్నర్లు ఆమోదం తెలపకుండా ఆపుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నాయి. ఆలస్యానికి గల కారణం తెలియజేయట్లేదని రెండు రాష్ట్రాలూ తమ పిటిషన్‌లలో కోర్టుకు తెలిపాయి. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గవర్నర్లకు తాజాగా నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news