26/11 ముంబయి ఉగ్ర దాడిలో కీలక నిందితుడు, లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణా భారత్కు చేరుకున్నాడు. అతణ్ని తీసుకువస్తున్న ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండైంది. ఈ క్రమంలో విమానాశ్రయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు ప్రాంగణమంతా SWAT కమాండో బృందం మోహరించింది. పటిష్ఠ భద్రత నడుమ తహవూర్ రాణాను ఎన్ఐఏ కేంద్ర కార్యాలయానికి రాణాను తరలిస్తున్నారు. అనంతరం రాణాను NIA విచారించనుంది. ఈ క్రమంలో ఎన్ఐఏ హెడ్ ఆఫీసు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
మరోవైపు తహవూర్ రాణాపై ఎన్ఐఏ నమోదు చేసిన కేసును వాదించడానికి కేంద్ర సర్కార్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మాన్ను నియమించింది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టులు, అప్పిలేట్ కోర్టుల్లో ఆయన వాదనలు వినిపించనున్నట్లు కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది. దాదాపు 3 ఏళ్లపాటు లేదా కేసు విచారణ పూర్తయ్యే వరకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మాన్ కొనసాగనున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది.