ఆ పురుగు మందుల వాడకంపై నిషేధం విధించిన కేంద్రం

-

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం 4 పురుగుమందుల వాడకంపై నిషేధం విధించింది. డైకోఫాల్, డైనోక్యాప్, మేతోమిల్, మోనోక్రోటోఫాస్ ల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ లిస్టులో తొలి 3 మందులకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, విక్రయాలు, పంపిణీ పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

The Center has banned the use of pesticides
The Center has banned the use of pesticides

మొనోకోటోఫాస్ మందు తయారీకి ఇకనుంచి కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేయబోమని తెలిపింది.

ఈ పురుగుమందులు ఆ పంటలకు వాడొద్దు: కేంద్రం

* మలాథియాన్: జొన్నలు, శనగ, సోయాబీన్, ఆముదం, పొద్దుతిరుగుడు, బెండ, వంకాయ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, యాపిల్, మామిడి, ద్రాక్ష, టమాటా. * క్వినాల్ ఫాస్ : జూట్, యాలకులు, జొన్న * మ్యాన్ కోజేబ్ : జొన్న, జామ, టాపియోకా * ఆక్సీ ఫ్లోర్ ఫెన్ : ఆలూ, వేరుశెనగ * డైమిథోయేట్ : పండ్లు, కూరగాయలు * క్లోరోపైరీఫాస్ : రేగు, నిమ్మ, పొగాకు, బత్తాయి

 

Read more RELATED
Recommended to you

Latest news