కర్ణాటకలో దారుణం.. భార్య తల నరికి ముక్కలు చేసిన భర్త..!

-

కర్ణాటకలో దారుణం జరిగింది. భర్త తన భార్యను హతమార్చడమే కాకుండా ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికిన ఘటన  చోటు చేసుకుంది. మంగళవారం రోజు ఈ విషయం వెలుగులోకి రాగా.. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం, తుమకూరు జిల్లాలోని హోస్పేట్ గ్రామంలో నిందితుడైన శివరామ్ తన భార్య 32 ఏళ్ల పుష్ప, తమ ఎనిమిదేళ్ల చిన్నారితో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

ఈ దంపతుల మధ్య సోమవారం రాత్రి  ఏదో విషయంపై గొడవ జరిగింది. అదికాస్త తీవ్రం కావడంతో శివరామ్ తన భార్య తలను నరికాడు, ఆ తర్వాత వంటగదిలో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. పుష్ప స్వస్థలం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర పట్టణం. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన భర్త శివరామ్ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా గత కొంత కాలంగా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు వెల్లడైంది.

Read more RELATED
Recommended to you

Latest news