తండ్రి మృతదేహం ఎదుట కుమారుడు పెళ్లి జరిగింది. తండ్రి మృతదేహం ఎదుట కొడుకు పెళ్లి చేసుకున్న సంఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్ కుమారుడు అప్పు, విజయశాంతి అనే యువతి ప్రేమించుకుంటున్నారు.

ఇరు కుటుంబాల అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం చనిపోయారు. తండ్రీ ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో తండ్రి మృతదేహం ఎదుట ప్రియురాలికి అప్పు తాళి కట్టాడు.
- తమిళనాడు
- తండ్రి మృతదేహం ఎదుట కూమారుడి వివాహం..
- కడలూరు జిల్లా కవణ్ణైలో ఘటన…
- రైల్వే ఉద్యోగి సెల్వరాజ్ అనారోగ్యంతో మృతి
- …రెండో కూమారుడు అప్పు న్యాయ విద్యార్థి
- …డీగ్రీ విద్యార్థిణి విజయశాంతితో గత మూడు సంవత్సరాలుగా ప్రేమాయణం..
- ఇరుకుటుంబాలతో వివాహం చేసుకోవాలని నిర్ణయం..
- తండ్రి మరణించడంతో భౌతిక కాయం వద్ద ప్రియురాలి కి తాళి కట్టిన అప్పు..
- వివాహానికి దూరంగా ఉన్న అమ్మాయి కుటుంబం.