IND VS WI : విండీస్ చేతిలో ఘోరంగా ఓడిన టీమిండియా

-

వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిపాలైంది. నిన్న జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ చేతిలో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 40 ఓవర్ల లో కేవలం 181 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. టీమిండియా మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో… 181 పరుగులు మాత్రమే చేసింది జట్టు.

ఇక అటు 182 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు.. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఈశాన్ కిషన్ ఒక్కడు 55 పరుగులు చేసి రాణించాడు. అయితే రెండో వన్డే మ్యాచ్లో జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. అతను ఈ మ్యాచ్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో సంజు శాంసన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version