Video Viral : యువతికి వేధింపులు.. చెప్పుతో కొట్టాలని పంచాయతీ తీర్పు

-

ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేయగా.. పంచాయతీ పెద్దలు అతణ్ని చెప్పుతో కొట్టమని తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో ఊరంతా చూస్తుండగా.. ఆ వ్యక్తిని యువతి చెప్పుతో కొట్టింది. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో పంచాయతీ తీర్పుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

“హాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి యువతిని వేధించడం మొదలుపెట్టాడు. మొదట ఆమె అతణ్ని మందలించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు వారించినా అతడు వినిపించుకోలేదు. చివరకు ఈ విషయాన్ని ఆ యువతి పంచాయతీ వరకు తీసుకెళ్లింది. విషయం తెలుసుకున్న పంచాయతీ పెద్దలు ఆ వ్యక్తి అందరి ముందు చెప్పుతో కొట్టాలని తీర్పు ఇచ్చారు. సదరు యువతి చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మా దృష్టికి వచ్చింది. మేం ఈ విషయంపైన దర్యాప్తు చేస్తున్నాం” అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news