యడియూరప్పపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ మృతి

-

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై ఇటీవల ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ మహిళ ఆదివారం రోజు రాత్రి (54) మరణించింది. ఏడాదిన్నరగా లంగ్ క్యాన్సర్తో బాధపడుతోందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం రాత్రి మహిళ ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందతూ మరణించారని వెల్లడించారు.

ఏం జరిగిందంటే?

బీఎస్ యడియూరప్ప తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ మార్చిలో ఫిర్యాదు చేసింది. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలవగా.. ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు యడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే తనకు ప్రాణ హాని ఉందని మహిళ పేర్కొంది. దీంతో మహిళకి పోలీసు భద్రత కల్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version