నా 30 ఎకరాలు రాసిస్తా.. మంత్రి జూపల్లికి శ్రీధర్‌ రెడ్డి తండ్రి సవాల్‌ !

-

నా కొడుకు మీద మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే నా పేరు మీదున్న 30 ఎకరాలు రాసిస్తా.. నిరుపించలేక పోతే జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ శ్రీధర్ రెడ్డి తండ్రి సవాల్‌ విసిరారు. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… శ్రీధర్ రెడ్డిని చంపిన నిందితుడు నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు.

BRS leaders plea to DGP

నిందితులు మీ ఇంట్లోనే ఉంటే ఇంక బాధిత కుటుంబానికి న్యాయం ఏం చేస్తావు అంటూ నిలదీశారు.
మేము డీజీపీని డిమాండ్ చేస్తున్నాం.. మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు, వాళ్లు అందరూ జూపల్లి కృష్ణ రావు చెప్పుచేతల్లో ఉన్నారు, వాళ్ల వల్ల మాకు న్యాయం జరగదన్నారు. అందుకే ఈ కేసును ఒక స్పెషల్ టీమ్ పెట్టి విచారణ చేయించాలి. పోలీసులు ఎవరైతే మంత్రితో కుమ్మక్కయ్యారో వాళ్లందరినీ డిస్మిస్ చేయాలని డీజీపీని డిమాండ్ చేయటం జరిగిందని తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version