BIG BREAKING : నయన్‌ విఘ్నేష్‌ దంపతులకు కవల పిల్లలు

-

లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ మొన్నటివరకు ప్రేమికులు. ఇవాళ్టి నుంచి భార్యభర్తలు. వీరిద్దరి వివాహం మహాబలిపురంలో గ్రాండ్ గా జరిగింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న నయనతార, విఘ్నేష్.. పెళ్లి ఈరోజు మహాబలిపురంలో పెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో 8:30 కు జరిగింది. పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి కోసం ముందుగానే భారీగా ఏర్పాట్లను పూర్తి చేశారు. చాలా మంది ప్రముఖులు నయనతార, విగ్నేష్ జంటను ఆశీర్వాదించారు. ఇదిలా ఉంటే.. నయన్‌-విఘ్నేష్‌ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యినట్లు ప్రకటించారు.

పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా కాకుండానే ఎలా అయ్యింది అని అందరూ అవాక్కయ్యారు. అయితే ఈ జంట సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయాన్నీ విఘ్నేష్.. శివన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ” నయన్ మరియు నేను అమ్మ, అప్పగా మారాము. మాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలు అన్ని కలిపి మాకు 2 శిశువుల రూపంలో కలిసి వచ్చాయి. మా కోసం మీ అందరి ఆశీస్సులు కావాలి. ఉయిర్ అండ్ ఉలగమ్ .. మీరు మా జీవితంలో ఎన్నో వెలుగులు నింపుతారని ఆశిస్తున్నాను. దేవుడు డబుల్ గ్రేట్” అని రాసుకొచ్చాడు. దీంతో షాక్ అయిన అభిమానులు కొద్దిగా తేరుకొని కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొద్దరూ మరొ రకంగా కామెంట్లు పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version