మళ్ళీ విషమించిన నాయిని ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేరిక

-

మాజీ హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి మళ్ళీ అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్‌ తో ఆయన ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం నాయికి కరోనా సోకింది. చికిత్స తీసుకోవడంతో ఆయన కరోనా నుండి కోలుకున్నారు. అయితే ఆయనకి కరోనా సోకడానికి కంటే ముందే నాయినికి గుండె ఆపరేషన్‌ జరిగిందని తెలుస్తోంది.

ఆయనకు కరోనా తగ్గడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే నాయిని మరోసారి అస్వస్థతకు గురయ్యారని అందుకే ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రిత‌మే క‌రోనా నుంచి కోలుకుని మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేర‌డంతో అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌నలో ఉన్నారు. నిజానికి ఆయ‌న క‌రోనా బారిన‌ప‌డిన స‌మ‌యంలో ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని గట్టిగా ప్ర‌చారం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version