NEET PG-2024 పరీక్ష ప్రీపోన్డ్

-

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షల తేదీలు మారుతున్నాయి. తాజాగా

NEET PG-2024 పరీక్ష ప్రీపోన్డ్ అయింది. షెడ్యూల్ ప్రకారం అయితే ఈ పరీక్ష జులై 7న జరగాల్సి ఉంది. కాని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ 23న నిర్వహించాలని నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయించింది. జులై 15న ఫలితాలు వెలువడనున్నాయి.

కాగా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news