నిన్న సాయంత్రం నుండీ ఏడుస్తూనే ఉన్న మాజీ ఎమ్మార్వో నాగరాజు

-

కీసర తహశీల్దార్ నాగరాజు మనోవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. నిన్న ఏసీబీ అధికారుల కస్టడీ ముగిశాక నాగరాజును జైల్ కు తరలించారు అధికారులు. జైల్ సిబ్బందిని నిన్న నాగరాజు పెన్ అడిగినట్టు సమాచారం. నిన్న సాయంత్రం నుండి ఏడ్చి ఏడ్చి నాగరాజు కృంగిపోయినట్టు తెలుస్తోంది.

తన భార్య కూడా బెంగుళూర్ కి వెళ్లిపోవడం, తనని ఎవరు పట్టించుకోక పోవడంతో తీవ్ర మనోవేదనకు నాగరాజు గురైనట్టు తెలుస్తోంది. ఈ తెల్ల వారు జామున కిటికీ కి టవల్ తో ఉరి వేసుకుని నాగరాజు ఆత్మ హత్య కు పాల్పడ్డట్టు సమాచారం. ఉస్మానియాలో నాగరాజు మృత దేహాన్నికి పోస్ట్ మార్టం కొనసాగుతున్నట్టు చెబుతున్నారు. అయితే ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేవంటూ నాగరాజు మృతి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు నాగరాజు కుటుంబీకులు. దీని మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news