గడ్కరి పేరు లేకపోవడం ఆశ్చర్యంగా వుంది: ఉద్ధవ్

-

పార్లమెంట్ ఎన్నికలకి గాను బిజెపి మొదటి జాబితాలో రిలీజ్ చేసిన 195 మంది అభ్యర్థుల లిస్టు లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పేరు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని శివసేన చీఫ్
ఉద్ధవ్ ధాక్రే అన్నారు. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుని పూర్తి చేయడం లో గడ్కరి ఎంతో సహకరించారని కొనియాడారు. ప్రస్తుతం ప్రతిపక్షాలను కూల్చే రాజకీయాలు జరుగుతున్నాయి అన్నారు. అవి సరైన పద్ధతి కాదని అన్నారు.

అవినీతికి పాల్పడిన నేతలని బిజెపి లో చేర్చుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత కృపాకర్ సింగ్ బీజేపీలో చేరారని గతంలో కృపాకర్ అవినీతిపరుడని దేవేంద్ర చేసిన కామెంట్స్ ని ఆయన మర్చిపోయారా అని అన్నారు. అయితే ఇప్పుడు మరోవైపు మహారాష్ట్రలోని 48 స్థానాలకి బిజెపి ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు నితిన్ గడ్కరి ప్రస్తుతం నాగపూర్ నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version