మరోసారి మానవత్వాన్ని చాటిన సీఎం రేవంత్ రెడ్డి..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. డిసెంబర్ 07న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే పలు సందర్భాల్లో పలువురు పేదలకు సాయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు.

CM Revanth Reddy

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రిలో తుంటి ఎముక ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడానికి వెళ్లే సయమంలో అస్పత్రి వద్ద ఓ మహిళ రేవంతన్న అని ఆప్యాయంగా పిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తన పిల్లల వైద్యం ఖర్చులు ఎక్కువ అవుతుందని సదరు మహిళ చెప్పడంతో.. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ విషయంలో స్పందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version