కేంద్రం బంపర్‌ ఆఫర్‌.. ఫోటో తీసి పంపిస్తే రూ.500..

-

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో నో పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలు నిలిపి ట్రాఫిక్‌ జాంకు కారణమవుతుననారు. అయితే.. నో పార్కింగ్ స్థలంలో వాహనం కనిపిస్తే వెంటనే ఫొటో తీసి పంపిస్తే నజరానా ఇవ్వనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. రోడ్లపై ఇష్టానుసారంగా పెరిగిపోయి తీవ్ర రద్దీకి కారణమవుతున్న అక్రమ పార్కింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఓ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాంగ్ పార్కింగ్ వాహనాలను ఫొటోలు తీసి అధికారులకు పంపిస్తే.. ఆ వాహనానికి విధించే జరిమానాలో సగాన్ని ఫొటో పంపిన వ్యక్తికి ఇవ్వనున్నట్టు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

ఫొటోలను పంపించే వ్యక్తులకు బహుమానం ఇవ్వడాన్ని చట్టంలోనూ పొందుపరుస్తామన్నారు నితిన్ గడ్కరీ. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు నితిన్ గడ్కరీ. ఇళ్ల వద్ద వాహన పార్కింగ్‌కు స్థలాన్ని కేటాయించకుండా రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో తన కుక్‌కు రెండు సెకండ్ హ్యాండ్ వాహనాలు ఉన్నాయని, నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న వారికి ఆరు వాహనాలు ఉంటున్నాయన్నారు నితిన్ గడ్కరీ. ఎవరూ పార్కింగ్ స్థలాన్ని విడిచిపెట్టడం లేదని, ఢిల్లీ వాసులు అదృష్టవంతులని, వారు రోడ్డు పక్కనే వాహనాలు నిలుపుతున్నారంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు నితిన్ గడ్కరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version