బ్రేకింగ్ : బీహార్ సీఎం ఇంట్లో కరోనా కలకలం..!

-

భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది… పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. దీని ధాటికి ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధాని, సీఎంలతో సహా అనేక మంది ప్రముఖులు చెప్తున్నారు. అయినాసరే సాధారణ ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా కరోనా బారిన అందరూ పడుతున్నారు. తాజాగా.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ మేనకోడలికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె పాట్నాలోని నితీష్ ఇంట్లోనే నివాసముంటుంది. దీంతో ఆమెను పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అంతేకాదు సీఎం నితీశ్ నివాసాన్ని శానిటైజ్ చేశారు. అలాగే బీహార్ శాసనమండలికి కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో నితీశ్ కుమార్ పక్కన మండలి చైర్మన్ అవధేశ్ నారాయణసింగ్ కూర్చున్నారు. ఆ తర్వాత నారాయణసింగ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో నితీశ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version