నిత్య జనగణమన కార్యక్రమం స్పూర్తిదాయకం: ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి

-

లీడర్స్ ఫర్ సేవా సంస్థ హైదరాబాద్‌లోని నల్లకుంటలో చేపట్టిన నిత్య జన గణ మన కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.. యువత చేస్తున్న సేవకార్యక్రమాలను ఆయన కొనియాడారు. సంస్థ నిర్వాహకులు అయిన నేలంటి మధు, మల్లాడి క్రాంతి, సర్వు అశోక్, జూకంటి ప్రశాంత్, ఏం కే శ్రీనివాస్, నల్ల ప్రవీణ్‌లు కార్యక్రమాల వివరాలు ఉపముఖ్యమంత్రికి తెలిపారు. జమ్మికుంట నుంచి బైక్ ర్యాలీ ద్వారా జాతీయ జెండాను తీసుకువచ్చి ఇక్కడ స్థాపించి 50 రోజులుగా ప్రతినిత్యం జనగణమన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

సంస్థ చేస్తున్న కార్యక్రమం గురించి తెలుసుకుని ఉపముఖ్యమంత్రి భావోద్యేగానికి గురయ్యారు. నిత్యజన గణ మన కార్యక్రమాన్ని ఎప్పటికీ కొనసాగించాలనుకునేవడం గొప్ప విషయమని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు జి గౌతమ్ రావు, స్థానిక కౌన్సిలర్ వై అమృత పాల్గొన్నారు. నిత్య జన గణ మన కార్యక్రమం ద్వారా జాతీయతా స్ఫూర్తిని విస్తరింపజేస్తున్న యువతను ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రత్యేకంగా అభినందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version