బ్రేకింగ్ : ఫిలిప్పీన్స్‌లో రోడ్ యాక్సిడెంట్.. నిజామాబాద్ విద్యార్థి మృతి!

-

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు విగతజీవులుగా మారుతున్నారు. తమ కలలను సాకారం చేసుకోవడానికి విదేశాలకు వెళ్లగా వారి ఆశలు కల్లలవుతున్నాయి. కొందరు ప్రమాదాల బారిన పడి మరణిస్తుంటే మరికొందరు హత్యలకు గురవుతున్నారు.తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వైద్యవిద్యార్థి విదేశాల్లో ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణానికి ప్రమాదమే కారణమని తెలుస్తోంది.

 

వివరాల్లోకివెళితే.. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి అక్షయ్ మృతి చెందాడు. ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసేందుకు అక్షయ్ ఫిలిప్పీన్స్ వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలోనే అక్కడ ద్విచక్రవాహనంపై వెళ్తున్న అతని వాహనాన్ని రాంగ్ రూట్‌లో వచ్చిన మరో వాహనం వేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరో 6 నెలల్లో చదువు పూర్తయి అక్షయ్ ఎంబీబీఎస్ పట్టా అందుకునేవాడు.అనుకోకుండా ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. అక్షయ్ మృతి కారణంగా ఆయన స్వగ్రామం వేల్పూరులో తీవ్ర విషాదం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version