సమాధి నుంచి బయటకు రానున్న నిత్యానంద..

-

నిత్యానంద స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అయితే.. గత కొన్ని రోజులుగా నిత్యానంద సమాధిలో ఉన్నట్లు వార్తలు వస్తునే ఉన్నాయి. అయితే.. ఈ నెల 13న గురుపూర్ణిమ సందర్భంగా భక్తుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కొద్ది నెలలుగా కైలాస దేశం నుంచి నిత్యానందకు సంబంధించి ఎలాంటి వీడియోలు వెలువడకపోవటంతో ఆయన భక్తులు ఆందోళన చెందారు. తాను నిర్వికల్ప సమాధిలో ఉన్నానని, త్వరలో భక్తులకు దర్శనమిస్తానని నిత్యానంద తరచూ ప్రకటనలు జారీ చేస్తూ వచ్చారు.

కొద్ది రోజులకు ముందు నిత్యానంద విగ్రహాలకు అభిషేకం చేస్తున్న వీడియో వెలువడి కలకలం రేపింది. ఆ వీడియోను చూసి నిత్యానంద మృతి చెందారని భక్తులు అనుమానించారు. ఈ పరిస్థితులలో తాను సమాధి నుంచి బయటకు రాబోతున్నానని, గురుపూర్ణిమ దినాన సత్సంగ ప్రసంగం చేస్తానని, ఆ ప్రసంగం ప్రత్యక్షంగా ప్రసారమవుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు నిత్యానంద.

Read more RELATED
Recommended to you

Exit mobile version