ఉత్తర ప్రదేశ్ లో దారుణం.. ఫ్లష్‌ చేయడంతో పేలిన టాయిలెట్‌ సీటు

-

Normal toilet seat explodes in Noida home: ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఫ్లష్‌ చేయడంతో టాయిలెట్‌ సీటు పేలింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని నోయిడాలో అషు అనే వ్యక్తి టాయిలెట్‌ను వినియోగించిన తర్వాత ఫ్లష్‌ చేయడంతో అది పేలింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మురుగునీటి పైపుల్లో మీథేన్ వాయువు పేరుకుపోవడం ఈ పేలుడుకు కారణంగా తెలుస్తోంది.

Normal toilet seat explodes in Noida home
Normal toilet seat explodes in Noida home

35 శాతం కాలిన గాయాలైన అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి ఘటన జరగడం తొలిసారి అని, ఐ. ఐ.టీ నిపుణుల సహాయం తో పరిశీలించి దర్యాప్తు చేస్తామని అధికారులు వెల్లడించారు.

అయితే ఈ సంఘటన బయటకు రావడంతో జనాలందరూ భయపడిపోతున్నారు. ఫారం టాయిలెట్స్ లో బాత్రూం పోయేందుకు భయపడిపోతున్నారు. ఇలా పేలుడం వింతగా ఉందని కొంతమంది ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news