కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు ఇంటికి నోటీసులు..!?

-

భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది.విజయవాడలోని ప్రకాశం బ్యారేజి దగ్గర కృష్ణా నది తీవ్ర ఉగ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో వరద ఉదృతి మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో ఏపీలోని కృష్ణా నది కరకట్ట లోపల వైపు ఉండే నివాసాలకు మరోసారి అధికారులు నోటీసులు అందచేశారు. అయితే ఈ నోటీసులు జారీచేసిన నివాసాలలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం కూడా ఉంది.ఈరోజు అనగా మంగళవారం మధ్యాహ్నం కరకట్ట ప్రాంతాల్లోని 36 ఇళ్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులిచ్చారు.

ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉదృతి ఎక్కువగా ఉంది.ఈ నేపథ్యంలోనే కరకట్ట నిర్మాణాలను వెంటనే ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.వరద ఎక్కువ అవుతుందని ముందుగానే సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఏక్షణమైనా వరద ఇంట్లోకి రావచ్చని రెవెన్యూ శాఖ ముందుగా అలెర్ట్ అయ్యింది.ఇదిలా ఉంటే కృష్ణా నదిలో 6లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news