అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్మెన్, వార్డర్స్ కేటగిరిలో ఖాళీగా ఉన్న 2,723 ఉద్యోగాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకు ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి 6న లిఖిత పరీక్ష ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్ధులకు ఫిబ్రవరి రెండో వారంలో దేహ దారుఢ్య పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి నెల మొదటి వారంలో అంతిమ లిఖిత పరీక్ష నిర్వహించనున్నట్లు డీజీపీ ఠాకూర్ వెల్లడించారు. వయో పరిమితి పెంచే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ పరీక్ష ఫలితాలను మార్చి నెలాఖరుకు విడుదల చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ ఠాకూర్ విలేకరులకు తెలిపారు.
పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
మన గొంతు కోసేందుకు సిద్ధమయ్యారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక ఎన్నికల ప్రచారంలో...
Anji N -
మైనార్టీ రిజర్వేషన్ల పై చంద్రబాబు సంచలన ప్రకటన
మైనార్టీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తిరుపతి జిల్లా గుడూరులో...
Anji N -
జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. అధికార...
Anji N -