పోలీస్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

-

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఏఆర్‌, ఏపీఎస్పీ, ఫైర్‌మెన్‌, వార్డర్స్ కేటగిరిలో ఖాళీగా ఉన్న 2,723 ఉద్యోగాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నవంబ‌ర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి 6న లిఖిత పరీక్ష ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్ధులకు ఫిబ్రవరి రెండో వారంలో దేహ దారుఢ్య పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి నెల మొదటి వారంలో అంతిమ లిఖిత పరీక్ష నిర్వహించనున్నట్లు డీజీపీ ఠాకూర్‌ వెల్లడించారు. వయో పరిమితి పెంచే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ పరీక్ష ఫలితాలను మార్చి నెలాఖరుకు విడుదల చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ ఠాకూర్ విలేక‌రుల‌కు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news