యూపీలో దారుణం..నర్సును రేప్‌ చేసి.. ఆ తర్వాత ఉరేసి దారుణం !

-

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉన్నావ్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బంగర్‌ మౌ కొత్వాలీ ప్రాంతంలోని ఆస్పత్రి ఆవరణలోనే ఓ నర్సు ఉరితాడుకు వేలాడుతూ.. కనిపించింది. నర్సులగా ఉద్యోగంలో చేరిన తర్వాతి రోజే ఈ సంఘటన చోటు చేసుకుంది. మృత దేహం అనుమానస్పద రీతిలో గోడకు వేలాడుతూ ఉండటాన్ని చూసిన ఆస్పత్రి వర్గాలు… పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాయి.

అయితే… నర్సు మృతి పై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. యువతి పై సాముహిక అత్యాచారం జరిగిందని ఆరోపణలు చేశారు. నిందితులే.. ఆమె ఉరి వేసి.. చంపేసి ఉంటారని అన్నారు. ఇక ఈ మేరకు పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. న్యూజీవన్‌ ఆస్పత్రిలో శుక్రవారమే ఆమె నర్సుగాచేరిందని కుటుంబ సభ్యులు చెప్పారని ఎస్పీ శశి శేఖర్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ కేసులో నిందితులను శిక్షిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news