తండ్రి మందలించాడని ఆత్మహత్య చేసుకున్న కుమార్తె

-

విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.తండ్రి మందలించాడని మనస్థాపానికి గురైన కుమార్తె ఆత్మహత్య చేసుకుంది.ఆశపు కుమారస్వామి అనే వ్యక్తి శ్రీనివాస నగర్ లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.ఈయన కుమార్తె జ్ఞానప్రసూన (20) ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది.అయితే ఈమె ప్రతిరోజు కళాశాల నుంచి ఆలస్యంగా ఇంటికి రావడంతో తండ్రి మందలించాడు.దీంతో జ్ఞాన ప్రసూన మనస్థాపానికి గురైంది.తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఫ్యాన్ కు ఉరి వేసుకుంది.

ఉదయం తల్లిదండ్రులు లేచి చూసేసరికి పక్కనే ఉన్న కుమార్తె కనిపించలేదు.వెంటనే కిందకు వచ్చి చూడగా గదిలో లైట్ వేసి ఉంది.లోపలికి వెళ్లి చూడగా, జ్ఞాన ప్రసూన ఫ్యాన్ కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించింది.కూతుర్ని అలా చూడగానే తల్లిదండ్రులు బోరున విలపించారు. వెంటనే ఇరుగుపొరుగు వారికి తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news