దేశంలో మొదలైన థర్డ్ వేవ్..! కోవిడ్ టాస్క్ ఫోర్స్ వెల్లడి

-

దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ మొదలైందా…అంటే జౌననే సమాధానాలే వినిపిస్తున్నాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇది థర్డ్ వేవ్ కు సంకేతమని అన్నారు కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ ఎన్ కే అరోరా. దేశంలో గత నాలుగైదు రోజులుగా అనూహ్యంగా కరోనా కేసులు నమోదయ్యాయి.. దేశంలో థర్డ్ వేవ్ మొదలైదనడానికి ఇదే కారణం అని అన్నారు. ముఖ్యంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఆయన అన్నారు.

డిసెంబర్ మొదటివారంతో పోలిస్తే చివరి వారం ఓమిక్రాన్ కేసుల సంఖ్య రెట్టింపు అయిందని ఆయన అన్నారు. దేశంలో కోవిడ్ కేసుల్లో 28 శాతం పెరుగుదల నమోదైందని తెలుస్తోంది. ముఖ్యంగా మెట్రోనగరాలైన ఢిల్లీ, కోల్ కతా, ముంబై లలోనే 75 శాతం కేసులు నమోదవుతున్నాయని అరోరా అన్నారు. టెస్ట్ పాజిటివిటీ రేటు పెరగడంతో పాటు ఆర్. వాల్యూ పెరగడం కూడా థర్డ్ వేవ్ ముందస్తు హెచ్చరికలే అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version