హైదరాబాద్‌లో మరోసారి పోస్టర్ల రచ్చ.. ప్రధాని మోడీ టార్గెట్‌గా పోస్టర్లు

-

హైదరాబాద్‌లో మరోసారి పోస్టర్ల రచ్చ చోటు చేసుకుంది. ప్రధాని మోడీ టార్గెట్‌గా పోస్టర్లు వెలిశాయి. తాజాగా హైదరాబాద లో ప్రధాని మోడీపై వాల్ పోస్టర్లు వెలిశాయి. మోడీ గారు ఈ ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాలు కడతారు..? అంటూ సెటైర్లు వేస్తూ.. పోస్టర్లు అంటించారు.

ఐదు సంవత్సరాలైనా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ 40 శాతం కూడా పూర్తి కాలేదని ఈ పోస్టర్ల ద్వారా నిలదీశారు. ఫ్లైఓవర్ పిల్లర్లపై మోడీ చిత్రపటంతో వెలిశాయి పోస్టర్లు. హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిలో ఫ్లై ఓవర్ పిల్లర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోస్టర్లు చిత్రపటం ముద్రించి వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని  ఉన్న ప్లైఓవర్ పిల్లర్లకు అంటించారు పోస్టర్స్. ఇక దీనిపై బీజేపీ శ్రేణులు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version