అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ.. ముగ్గురు మృతి..

-

మరోసారి అమెరికాలో తుపాకీ కాల్పులు కలకలం రేపుతున్నాయి. మేరీల్యాండ్‌లోని స్మిత్స్‌బర్గ్‌లో కొలంబియా మెషీన్ అనే మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలోకి చొరబడిన దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు వాషింగ్టన్ సిటీ పోలీసులు తెలిపారు. బాధితులు కంపెనీ ఉద్యోగులా? కాదా? అన్న విషయంలో స్పష్టత లేదని పేర్కొన్నారు.

కాల్పుల తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితుడిని ఘటనా స్థలానికి కొద్ది దూరంలో మేరీల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. అయితే న్యూయార్క్‌ నగరంలో 21 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే గన్‌ కొనుగోలుకు అనుమతులు ఇస్తూ ఇటీవలే అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version