మరోసారి బారత్‌పై నోరు పారేసుకున్న ట్రంప్..

-

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల అంశాన్ని తెరపైకి తెచ్చారు.తాను అధికారంలోకి వస్తే పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్ను విధిస్తానని నొక్కి చెప్పారు. టారిఫ్ అనేది ఆయన డిక్షనరీలో చాలా అందమైన పదం అని పేర్కొన్నారు. అమెరికా కంపెనీలు వృద్ధికి టారిఫ్‌లు ఉపయోగపడతాయన్నారు.

‘అమెరికాను వాడుకుని శత్రు దేశాల కంటే మిత్రదేశాలే ఎక్కువ లాభం పొందుతున్నాయి. ఈయూతో మనకు 300 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. అమెరికా వాణిజ్య ఒప్పందాలు సరిగా లేవు అని బైడెన్ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు.గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్న టైంలో చైనాపై 27.5శాతం టారిఫ్‌లు విధించానని చెప్పారు. అలా చేయకపోతే అమెరికా అంతా చైనా కార్లే ఉండేవని, అప్పుడు మన దేశంలోని ఫ్యాక్టరీలన్నీ మూతబడేవి అని అన్నారు.ఇక భారత్ కూడా సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version