Telangana : ఆర్టీసీ బస్సుల్లో 1.21 కోట్ల మంది ప్రయాణం

-

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఈనెల 11 నుంచి 14 వరకు 1.21 కోట్ల మంది ప్రయాణించారని టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు అదనంగా ప్రయాణించారని చెప్పారు. వీరి కోసం 3,203 ప్రత్యేక బస్సులను నడిపినట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక బస్సుల వ్యవహారాలపై సోమవారం ఆయన ఆన్‌లైన్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. 2,384 బస్సులు నడపాలని తొలుత నిర్ణయించినా రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 891 బస్సులు అదనంగా నడిపామన్నారు. ఈ నాలుగు రోజుల్లో 1.57 కోట్ల కిలోమీటర్ల మేర బస్సులు ప్రయాణించాయని, సొంత ప్రాంతాలకు వెళ్లిన వారు మంగళవారం తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా మూడు వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version