ఏపీలో నేడు 3,464 క‌రోనా ప‌రీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితులు దాదాపు సాధార‌ణ ప‌రిస్థితులకు చేరుకున్నాయి. రాష్ట్రంలో ఇప్ప‌టికే సింగిల్ డిజిట్ లో కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌త కొద్ది రోజుల నుంచి 5 లోపే కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ రోజు క‌రోనా బులిటెన్ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కేవ‌లం ఒక్క కేసు మాత్ర‌మే న‌మోదు అయింది.

ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 3,464 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. భారీగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించినా.. కేవ‌లం ఒక్క‌టి అంటే ఒక్క పాజిటివ్ కేసు మాత్ర‌మే వెలుగు చూసింది. అలాగే నేడు రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం కేవలం 33 క‌రోనా యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. కాగ ఈ రోజు కూడా రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version