ఆ రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్‌లో అగ్రతాంబూలం..మంత్రి జూపల్లి కృష్ణారావు సెటైర్

-

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, ఆర్థిక రంగ నిపుణులు బడ్జెట్‌పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి నిరాశజనకంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణకు రూపాయి నిధులు కూడా కేటాయించకపోవడం పక్షపాత ధోరణినికి నిదర్శనమని మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి ఓట్లు మాత్రమే కావాలని.. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోకుండా మొండిచేయి చూపి మోసం చేశారని ఆయన విమర్శించారు. బడ్జెట్‌లో విభజన హామీలను ప్రస్తవించకపోవడం దారుణమని అన్నారు. ఎన్టీఏ సర్కార్ ఏర్పడేందుకు కీలక పాత్ర పోషించిన ఆంధ్ర ప్రదేశ్, బిహార్, అసోం రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్‌లో అగ్రతాంబూలం ఇచ్చారని మంత్రి జూపల్లి ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news