భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కాసేపటి కిందట ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.బార్డర్లో పాకిస్తాన్ బరితెగించి దాడులకు పాల్పడటం, ఆపరేషన్ సిందూర్కు పోటీగా పాక్ ఆర్మీ ‘ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్’ ప్రారంభించిన నేపథ్యంలో వీరి భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ప్రధాని మోడీతో సమావేశానికి ముందు అజిత్ దోవల్.. త్రివిధ దళాలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే, తాజా పరిణామాలు, పాక్ చేపట్టిన ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్పై ప్రధానికి అజిత్ దోవల్ వివరించినట్లు తెలిసింది.మరికాసేపట్లో విదేశాంగ శాఖ మీడియా సమావేశం నిర్వహించనున్నది. పాక్ చేస్తున్న దాడులు, భారత త్రివిధ దళాలు వాటిని తిప్పికొడుతున్న తీరును విదేశాంగ శాఖ కార్యదర్శి మీడియాకు వివరించనున్నారు.